hyderabadupdates.com Gallery అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం

అభివృద్దికి న‌మూనా  ప్ర‌జా పాల‌న : సీఎం post thumbnail image

ఖ‌మ్మం జిల్లా : వైరా ప‌ట్ట‌ణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్‌ నిర్వహించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , డీసీసీ నూతి సత్యనారాయణ గౌడ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ కార్యక్రమం కాద‌ని, వైరా భవిష్యత్తును నిర్ణయించే తీర్పు అని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలా, లేక గత నిర్లక్ష్య పాలనను కొనసాగించాలా అన్నది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలోనే వైరాలో అభివృద్ధి జరిగింద‌ని చెప్పారు అనుముల రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజీ, ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చేయడం, పాలిటెక్నిక్ మంజూరు వంటి కార్యక్రమాలు వైరా భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార‌నుంద‌ని చెప్పారు. చిన్న వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువల లైనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వైరాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్ర‌జ‌లను కోరారు రేవంత్ రెడ్డి.
The post అభివృద్దికి న‌మూనా ప్ర‌జా పాల‌న : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల

ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’

హైద‌రాబాద్ : ఉప్పెన మూవీతో సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. త‌న కెరీర్ లో మ‌రో కీల‌క‌మైన చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది . ఆ సినిమానే పెద్ది. ఇప్ప‌టికే అంచ‌నాలు మ‌రింత పెంచేలా

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీసంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

ముంబై : ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించినా ఆ జ‌ట్టును, మేనేజ్ మెంట్ ను ప్ర‌ధాన స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది. ప‌నిగ‌ట్టుకుని స్టార్ ప్లేయ‌ర్లు శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌ల‌ను ప్ర‌మోట్ చేశారు