hyderabadupdates.com movies బన్నీని కావాలనే టార్గెట్ చేశారా?

బన్నీని కావాలనే టార్గెట్ చేశారా?

బన్నీని కావాలనే టార్గెట్ చేశారా? post thumbnail image

కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీమ్ చాలా వేగంగా స్పందించింది.

బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత రూల్స్ ఉన్నాయని ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామానా అనే ఒక డౌట్ వస్తోంది. 

ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తన ఇన్‌స్టా స్టోరీలో “మనం వైరల్ అయిపోయాం.. అందరూ నన్ను ట్యాగ్ చేయండి” అంటూ పెట్టిన పోస్టులు చూస్తుంటే, రీచ్ కోసమే ఈ పని చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోందని బన్నీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. బన్నీ టీమ్ ఈ వ్యవహారంపై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది.

ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీమ్ పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను స్ప్రెడ్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

నిజానికి సదరు యాంకర్ సబ్స్క్రైబర్లు 500 కూడా లేకపోవడంతో, రీచ్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. తన రీల్ వైరల్ అయినందుకు ఆమె ఎంతో ఆనందపడుతూ పెట్టిన పోస్టులే ఇదొక ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ నోటీసు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Related Post

కుప్పంలో యాపిల్ ఛాసిస్ యూనిట్!కుప్పంలో యాపిల్ ఛాసిస్ యూనిట్!

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. వాస్తవానికి శనివారమే ఏడు కీలక పరిశ్రమలకు చంద్రబాబు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు రానున్నాయి. స్థానికంగా 10

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం