hyderabadupdates.com Gallery ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ post thumbnail image

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బౌల‌ర్లు కూడా స్పిన్ మాయ‌జాలం చేయ‌డంతో పాక్ సునాయ‌సంగా గెలుపొందింది. ఈ రెండు జ‌ట్లు గ్రూప్ – ఎలో త‌ల‌ప‌డ్డాయి. ఫ‌ర్హాన్ 41 బంతులు ఎదుర్కొని 73 ర‌న్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది. అబ్రార్ అహ్మ‌ద్ 30 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీయ‌గా . షాదాబ్ ఖాన్ 26 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు, ఉస్మాన్ తారిక్ 27 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
న‌వాజ్ 21 ర‌న్స్ ఇచ్చి మ‌రో వికెట్ కూల్చాడు. అనంత‌రం 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది అమెరికా జ‌ట్టు. 8 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది అమెరికా జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ టీమ్ కు ఇది రెండో విజ‌యం టోర్నీలో. ఇక అమెరికా జ‌ట్టు గెలుపు కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. శుభ‌మ్ రంజానే దూకుడుగా ఆడాడు. త‌ను కేవ‌లం 30 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 51 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్లు ష‌యాన్ జ‌హంగీర్ 34 బాల్స్ ఎదుర్కొని 49 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. గౌస్ 13 బాల్స్ ఎదుర్కొని 13 ర‌న్స్ చేశాడు. చివ‌ర‌కు పాకిస్తాన్ బౌల‌ర్ల మాయాజాలానికి వికెట్లు పారేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.
The post ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌

    తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకాBomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

    2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో

CM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంCM Chandrababu: డేటా ఆధారిత పాలనసై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం

  డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొనగా… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దీర్ఘకాలిక, మధ్యకాలిక,