hyderabadupdates.com Gallery అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్ post thumbnail image

ఇరాన్ : మ‌రో యుద్దానికి తెర తీయ‌నున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయ‌న గ‌త కొంత కాలంగా ప‌లు దేశాలపై పెత్త‌నం చెలాయించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య‌న ఇండియాను బెదిరించారు. ర‌ష్యాతో సంబంధం తెంచు కోవాల‌ని ఒత్తిడి చేశాడు. ఆపై సుంకాలు విధించాడు. ఆపై హెచ్ 1 బి వీసాల‌ను ఇచ్చేది లేదంటూ బాంబు పేల్చాడు. రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తూ ప్ర‌పంచంలో ఒక భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించే ప్ర‌యత్నం చేస్తున్నాడు. ఈ త‌రుణంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అణుబాంబును ప్ర‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీనిపై ఇరాన్ స్పందించింది. డోంట్ కేర్ అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని పదే పదే బెదిరించడం ప‌ట్ల త‌ప్పు ప‌ట్టింది. నీకు అంత సీన్ లేదంటూ మండిప‌డింది.
ఈ మేర‌కు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ పై , ఆయ‌న చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగాడు. ఇక్క‌డ చేతులు క‌ట్టుకుని ఎవ‌రూ లేర‌ని , త‌మ‌కు కూడా స‌రైన బ‌ల‌గం ఉందంటూ ప్ర‌కటించాడు. ఎలాంటి చ‌ర్య‌ల‌నైనా ఎదుర్కొనే స‌త్తా త‌మ‌కు ఉందని ప్ర‌క‌టించాడు. అన్నింటిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం, శ‌క్తి త‌మ‌లో ఉంద‌ని, వెన‌క్కి త‌గ్గ‌బోమంటూ వెల్ల‌డించాడు ఖ‌మేనీ. ఈ సంద‌ర్భంగా ఇరాన్ అణుశక్తి చీఫ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఏ దేశం కూడా ఇరాన్ అణుశక్తి హక్కును హరించదని స్ప‌ష్టం చేశాడు. రాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనల ప్రకారం కొనసాగుతోందని అన్నాడు మొహమ్మద్ ఎస్లామి ఇరాన్ .
The post అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ

ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాంఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం

న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప‌లు కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ

Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌

Lawyer Rakesh Kishore : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై కోర్టు రూమ్‌లో సోమవారం బూటు విసిరేసిన ఘటనపై న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ (Lawyer Rakesh Kishore) స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి చింతా లేదని తెలిపారు.