hyderabadupdates.com movies వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో ఒకప్పుడు పేరున్న సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. గోపీచంద్ హీరోగా శౌర్యం, శంఖం సినిమాలు తీశాడతను. తర్వాత సొంత భాషలో ‘విక్రమార్కుడు’ సినిమాను ‘సిరుత్తై’ పేరుతో రీమేక్ చేస్తే అది పెద్ద హిట్టయింది.

ఆపై అతను సొంత కథలతో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తీశాడు. ఇందులో వివేగం మినహా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే అజిత్‌కు మూడు హిట్లు ఇచ్చినా సరే.. తన విషయంలో అజిత్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. అజిత్‌ను ఒక మూసలోకి తీసుకెళ్లిపోయాడని.. రొటీన్ సినిమాలు తీసి విసిగించాడని అంటుంటారు. ఐతే అజిత్ కాకుండా శివ వేరే హీరోలతో సినిమాలు తీస్తే అస్సలు వర్కవుట్ కాలేదు.

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో తీసిన ‘అన్నాత్తే’, సూర్యతో చేసిన ‘కంగువ’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో శివ పట్ల కోలీవుడ్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. తనతో సినిమా చేయడానికి స్టార్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అజిత్ మళ్లీ అతడికి అవకాశమిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వరుస ఫ్లాపుల తర్వాత గత ఏడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ట్రాక్ ఎక్కాడు అజిత్. ఆ సినిమా అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. ఐతే ఆ సినిమా తీసిన ఆధిక్ రవిచంద్రన్‌తోనే ఇంకో సినిమాను అజిత్ లైన్లో పెట్టాడు. కానీ ఇప్పుడేమో లైనప్ మారిందంటున్నారు. మధ్యలోకి శివ సినిమా వచ్చిందని.. దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడని.. ఆ తర్వాతే ఆధిక్ సినిమా ఉంటుందని అంటున్నారు.

కానీ అజిత్ ఫ్యాన్స్ దీని పట్ల నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. శివ మళ్లీ రొటీన్ సినిమా తీస్తాడని.. ఫామ్‌లో లేని అతడితో మళ్లీ జట్టు కట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. లేక లేక ఒక పెద్ద హిట్ ఇచ్చిన ఆధిక్‌ను వదిలేసిన శివతో వెళ్లడాన్ని వాళ్లు అంగీకరించలేకపోతున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తుంటే ఫ్యాన్స్ వ్యతిరేకించినట్లే.. అజిత్ అభిమానులు కూడా ఇప్పుడు శివ సినిమా విషయంలో నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.

Related Post

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా పెరిగిపోయాయి. బాగా డ‌బ్బున్న వాళ్ల‌యితే ప‌దుల కోట్లు పెట్టి కూడా ల‌గ్జ‌రీ విల్లాలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి

వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ నిర్ణయాన్ని