hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ post thumbnail image

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జ‌రిగే కీల‌క మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం భారత జ‌ట్టు ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ టీమిండియా ఆశించిన మేర రాణించ‌డం లేదు. టోర్నీలో భాగంగా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో గెలుపొంది స‌త్తా చాటినా చివ‌ర‌కు సూప‌ర్ -88లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుచేతిలో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఇక ఇదే విభాగంగా ఇండియా టీం రెండు జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. మ‌రో వైపు విండీస్ టీం కూడా సూప‌ర్ షో చేస్తుండడంతో టీమిండియాకు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.
ఐసీసీ బిగ్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆశ‌లు రేపిన ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అందులో ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే బ్యాట‌ర్లుగా పేరొందిన అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ నిరాశ ప‌రిచారు. శాంస‌న్ నాలుగు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ కాగా కీల‌క‌మైన సౌతాఫ్రికా తో శ‌ర్మ కేవ‌లం 15 ప‌రుగులు సాధించాడు. బోణీ కొట్టాడు. అయినా ఇది త‌న వ‌ర‌కు చూస్తే మంచి స్కోర్ కానే కాదు. ఇక సంజు శాంస‌న్ వ‌ర‌కు చూస్తే ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నమీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 ర‌న్స్ చేశాడు. తాజాగా జింబాబ్వేతో రేపు జ‌రిగే మ్యాచ్ లో శాంస‌న్ ను వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ గా వాడుకోనున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
The post కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలిఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ. తాజాగా దీనికి కొన‌సాగింపుగా దురంధ‌ర్ ది రివెంజ్ పేరుతో కొన‌సాగింపుగా

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్