hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ post thumbnail image

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జ‌రిగే కీల‌క మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం భారత జ‌ట్టు ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ టీమిండియా ఆశించిన మేర రాణించ‌డం లేదు. టోర్నీలో భాగంగా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో గెలుపొంది స‌త్తా చాటినా చివ‌ర‌కు సూప‌ర్ -88లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుచేతిలో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఇక ఇదే విభాగంగా ఇండియా టీం రెండు జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. మ‌రో వైపు విండీస్ టీం కూడా సూప‌ర్ షో చేస్తుండడంతో టీమిండియాకు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.
ఐసీసీ బిగ్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆశ‌లు రేపిన ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అందులో ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే బ్యాట‌ర్లుగా పేరొందిన అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ నిరాశ ప‌రిచారు. శాంస‌న్ నాలుగు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ కాగా కీల‌క‌మైన సౌతాఫ్రికా తో శ‌ర్మ కేవ‌లం 15 ప‌రుగులు సాధించాడు. బోణీ కొట్టాడు. అయినా ఇది త‌న వ‌ర‌కు చూస్తే మంచి స్కోర్ కానే కాదు. ఇక సంజు శాంస‌న్ వ‌ర‌కు చూస్తే ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నమీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 ర‌న్స్ చేశాడు. తాజాగా జింబాబ్వేతో రేపు జ‌రిగే మ్యాచ్ లో శాంస‌న్ ను వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ గా వాడుకోనున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
The post కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

క‌రీంన‌గ‌ర్ బ‌ల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలిక‌రీంన‌గ‌ర్ బ‌ల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ వ‌ల్ల‌నే ఇవాళ మున్సిపాలిటీలు ప్ర‌గతి ప‌థంలో దూసుకు వెళుతున్నాయ‌ని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో