hyderabadupdates.com Gallery సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : ఐసీసీ టోర్న‌మెంట్ లో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, జింబాబ్వే జ‌ట్లు ఎవ‌రికి వారే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌కు గురి చేశారు అభిషేక్ శ‌ర్మ‌, ఇత‌ర బౌల‌ర్లు. దీంతో తీవ్ర స్థాయిలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఆట‌గాళ్ల ఆట తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం . ఈ మ్యాచ్ ఇండియాకు అత్యంత కీల‌కం. ఇందులో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది టీమిండియాకు. చెన్నైలో బుధ‌వారం భార‌త జ‌ట్టుకు చెందిన కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు.
జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో సంజు శాంస‌న్, అక్షర్ ప‌టేల్ లకు సంబంధించి ఏవైనా మార్పులు కనిపిస్తాయని మీరు భావిస్తున్నారా అన్న ప్ర‌శ్న‌కు కీల‌క స‌మాధానం ఇచ్చాడు కోట‌క్. అవును, మార్పులు ఉండవచ్చు. మేము ప్రతిదీ చర్చిస్తున్నామని అన్నాడు. ఎందుకంటే మాకు ఇద్దరు ఎడమచేతి వాటం ఓపెనింగ్ బౌలర్లు, మూడవ స్థానంలో ఒక ఎడమచేతి వాటం బౌలర్ ఉన్నారని తెలిపాడు. ప్రత్యర్థి జట్టుకు ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడని పేర్కొన్నాడు సితాన్షు కోట‌క్. నాకు వ్యక్తిగతంగా పెద్ద సమస్య కనిపించడం లేదని అన్నాడు. కానీ మిగ‌తా జ‌ట్ల కంటే త‌మ జ‌ట్టు టాప్ లో కొన‌సాగుతోంద‌ని చెప్పాడు. కానీ ఎందుక‌నో మావాళ్లు అంత‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌మ ముందు రెండు మ్యాచ్ లు త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. లేకపోతే టోర్నీ నుంచి తాము వైదొల‌గాల్సిన ప‌రిస్తితి నెల‌కొంద‌న్నారు.
The post సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పున‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న