hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తాజాగా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ప‌ర్ ఫార్మెన్స్ గురించి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జింబాబ్వేతో జ‌రిగిన కీల‌క పోరులో త‌ను కేవ‌లం 15 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 24 ర‌న్స్ చేశాడు. ఏ ఆట‌గాడైనా అద్బుతంగా ఆడాల‌ని అనుకుంటాడ‌ని అన్నాడు. కుదురు కునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు సంజూ శాంస‌న్ . జింబాబ్వేపై గెలుపొందిన అనంత‌రం త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.
మ్యాచ్ లో భాగంగా నా వంతు ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నాడు సంజు శాంస‌న్. అది కూడా ఓపెనర్‌గా, అయినప్పటికీ నేను ఈరోజు విఫలమయ్యానంటూ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో త్వరగా 20 పరుగులు చేసినప్పుడు, అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందన్నాడు. అతనికి బలమైన PR మద్దతు ఉందని నాకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ తాను ఇప్పటికీ నా వంతు ఆడేందుకు, బ‌ల‌మైన షాట్స్ కొట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పాడు కేరళ స్టార్ క్రికెట‌ర్. ఈ T20 ప్రపంచ కప్‌లో నేను టీమ్ ఇండియాకు ఇచ్చిన ప్రారంభం, రోహిత్‌కు ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వడానికి ఆరు T20 ప్రపంచ కప్‌లు పట్టిందన్నాడు సంజు శాంస‌న్. కాబట్టి ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టడం మానేసి మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాల‌ని అభిమానుల‌ను, క్రికెట్ ప్రేమికుల‌ను కోరాడు.
The post సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

    దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు జైపుర్, లఖ్‌నవూ, వారణాసి, ఇతర

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

  మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

    బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా