hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తాజాగా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ప‌ర్ ఫార్మెన్స్ గురించి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జింబాబ్వేతో జ‌రిగిన కీల‌క పోరులో త‌ను కేవ‌లం 15 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 24 ర‌న్స్ చేశాడు. ఏ ఆట‌గాడైనా అద్బుతంగా ఆడాల‌ని అనుకుంటాడ‌ని అన్నాడు. కుదురు కునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు సంజూ శాంస‌న్ . జింబాబ్వేపై గెలుపొందిన అనంత‌రం త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.
మ్యాచ్ లో భాగంగా నా వంతు ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నాడు సంజు శాంస‌న్. అది కూడా ఓపెనర్‌గా, అయినప్పటికీ నేను ఈరోజు విఫలమయ్యానంటూ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో త్వరగా 20 పరుగులు చేసినప్పుడు, అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందన్నాడు. అతనికి బలమైన PR మద్దతు ఉందని నాకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ తాను ఇప్పటికీ నా వంతు ఆడేందుకు, బ‌ల‌మైన షాట్స్ కొట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పాడు కేరళ స్టార్ క్రికెట‌ర్. ఈ T20 ప్రపంచ కప్‌లో నేను టీమ్ ఇండియాకు ఇచ్చిన ప్రారంభం, రోహిత్‌కు ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వడానికి ఆరు T20 ప్రపంచ కప్‌లు పట్టిందన్నాడు సంజు శాంస‌న్. కాబట్టి ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టడం మానేసి మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాల‌ని అభిమానుల‌ను, క్రికెట్ ప్రేమికుల‌ను కోరాడు.
The post సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది.

టీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబుటీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన

స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులుస్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు

హైద‌రాబాద్ : హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు క‌బ్జా కాకుండా కాపాడాల‌ని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న