అమరావతి : ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. తద్వారా ప్రతి రైతు తన భూవిస్తీర్ణం , పండించే పంటలు నమోదు చేయబడతాయని తెలిపారు. ఇప్పటి వరకు 48.15 లక్షల రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలు ఇచ్చామని తెలిపారు. ఖరీఫ్ 2025లో గరిష్టంగా 118 లక్షల ఎకరాలు, 198 లక్షల భూభాగాలలో పంట బుకింగ్ నిర్వహించబడగా, సుమారు 53 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఈ ఏడాది ఫ్రిబ్రవరి 23 తేదీ నాటికి వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ , సామాజిక అటవీ భూమలలో వివిద పంటల క్రింద మొత్తం 67.50 లక్షల ఎకరాలు బుక్ చేయబడ్డాయని తెలిపారు అచ్చెన్నాయుడు.
ఆంధ్రప్రదేశ్ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా అన్ని పంటలలో, చీడపీడల డిజిటల్ డేటాను సేకరించి సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వటం ద్వారా పంట నష్టాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్ టెక్నాలజీ, AI టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ మొదలగు టెక్నాలజీలను సమర్ధవంతంగా వాడుకొని, రియల్ టైంలో ఖచ్చితమైన వ్యవసాయ సమాచారాన్ని రైతులకు SMS ద్వారా నేరుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగుబడుల అంచనా, పంటల భీమా క్లైములకు కూడా ఈ టెక్నాలజీని అనుసంధానిస్తున్నామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో YES టెక్ విధానాన్ని రాష్ట్రం లోని 10 జిల్లాలలో అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు యాప్ ద్వారా అన్ని ముఖ్యమైన వ్యవసాయ సంబంధత సమాచారం , సేవలను ఒక వేదికలో నేరుగా మొబైల్ ఫోన్లలో అందిస్తున్నట్లు స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
The post ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
Categories: