hyderabadupdates.com Gallery ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా post thumbnail image

బెంగ‌ళూరు : గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కీల‌క పాత్ర పోషిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. కానీ అనుకోకుండా ప్ర‌స్తుతం మ‌ధ్య ప్రాచ్యంలో యుద్దం కొన‌సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై విరుచుకు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కావాల్సిన టాక్సిక్ పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆలోచించిన మేక‌ర్స్ ఉన్న‌ట్టుండి ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిత్ర నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా విడుదల తేదీని మార్చి వాయిదా ప్రకటించడం ద్వారా అభిమానులను , ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
యష్ నటించిన టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం సినిమాను సృష్టించాలనే దార్శనికతతో తాము భావించిన చిత్రం. కన్నడ, ఇంగ్లీషులో చిత్రీకరించిన ఈ మూవీ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత‌గానో ఎదురు చూస్తున్నారంటూ తెలిపారు. సంవత్సరాల అంకితభావంతో పనిచేసిన తర్వాత, మార్చి 19న మా చిత్రాన్ని మీ అందరితో పంచు కోవడానికి మేము సంతోషించామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా టాక్సిక్ ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
The post ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్

    బిహార్‌ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్‌పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం

టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధిటెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్ష‌ల మందికి ఉపాధి

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు