hyderabadupdates.com Gallery విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ post thumbnail image

న్యూఢిల్లీ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు ఇటీవ‌లే ఒక్క‌ట‌య్యారు. స్వంతంగా గృహ ప్ర‌వేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌తంగా ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. త‌మ పెళ్లికి, రిసెప్ష‌న్ కు రావాలంటూ కోరారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసినందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు మోదీ. బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల‌ను అభినందిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ చేస్తూ లేఖ పంపించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పీఎంఓ స్ప‌ష్టం చేసింది.
విజయ్ దేవరకొండ కుటుంబానికి అధికారిక ప్రశంసా లేఖను పంపింది. ఈ సంజ్ఞ నటుడి బృందం, కుటుంబ సభ్యులను ఆనంద పరిచింది. దేవరకొండ నివాసానికి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా లేఖ కాపీని కూడా పంపింది. ఈ లేఖ ఇవాళ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని కుటుంబం ఉంటున్న‌ ఇంటికి చేరింది. అరుదైన గుర్తింపుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నటుడి పీఆర్ బృందం ఆన్‌లైన్‌లో నవీకరణను పంచుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందుకోవడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించ బడుతుంది, ఫిబ్రవరి 26న జరిగిన ఈ ప్రముఖ జంట వివాహం మరింత చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ చేసినందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు విజయ్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా.
The post విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదలRJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల

RJD : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులుఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు