hyderabadupdates.com movies ఆ దర్శకుడికి ఛాన్సిచ్చేదెవరు?

ఆ దర్శకుడికి ఛాన్సిచ్చేదెవరు?

అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక మూసను అతను బ్రేక్ చేశాడు. లీడ్ క్యారెక్టర్లను పూర్తి డంబ్‌గా తీర్చిదిద్ది.. కథాకథనాలను ఏ దశలోనూ సీరియస్‌గా తీసుకోకుండా.. సీరియస్ అనిపించే సందర్భాల్లోనూ వినోదాన్ని పంచి.. అతను ఆద్యంతం నవ్వులు పంచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

కానీ అనుదీప్ మెరుపులు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయాయి. తన తర్వాతి చిత్రం ‘ప్రిన్స్’ నిరాశపరిచింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్‌కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా మినిమం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.

అనుదీప్ తొలి చిత్రం ‘పిట్టగోడ’ గురించి జనాలకు అస్సలు తెలియదు. మొత్తంగా నాలుగు సినిమాలు తీస్తే మూడు డిజాస్టర్లు అయ్యాయి. ఒక్కటే బాగా ఆడింది. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ప్రొడక్షన్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదీ తుస్సుమనిపించింది. ప్రిన్స్, ఫంకీ చిత్రాలు చూస్తే.. అనుదీప్‌కు వచ్చింది ఒకే స్టైల్ ఆఫ్ కామెడీ.. అది కూడా ఇప్పుడు సేల్ అయ్యేలా లేదనిపిస్తోంది. దీనికి మించి అతనేమీ చేయలేడు అనే ముద్ర పడిపోయింది. నవీన్ పొలిశెట్టి లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో తప్పితే.. అతడి మార్కు కామెడీని మరో నటుడు పండించలేడేమో అనిపిస్తోంది. ఒకవేళ నవీన్ వచ్చి అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేసినా సరే.. మళ్లీ ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్వించగలడా అన్నది సందేహమే. 

‘జాతిరత్నాలు’ తర్వాత ఒక దశలో రవితేజ లాంటి స్టార్ కూడా అనుదీప్‌తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న స్థాయి హీరోలు కూడా వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు దొరకడం కూడా సందేహంగా ఉంది. ఈ దశ నుంచి అనుదీప్ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ‘జాతిరత్నాలు’ తర్వాత పేరున్న హీరోలు, పెద్ద బేనర్లలో రెండు సినిమాలు చేయగలిగాడు కానీ.. ‘ఫంకీ’ తర్వాత అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి అతణ్ని నమ్మి సినిమా చేసే నిర్మాత, హీరోలు ఎవరో చూడాలి మరి.

Related Post

తిరుప‌తి అడవుల్లో పవన్… ఆ లుక్ ఏంటి డీసీఎం సార్తిరుప‌తి అడవుల్లో పవన్… ఆ లుక్ ఏంటి డీసీఎం సార్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శ‌నివారం తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మామండూరులో ఉన్న అట‌వీ ప్రాంతాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. అట‌వి త‌ల్లి బాట కార్య‌క్ర‌మాన్ని గ‌తంలో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అట‌వీ విస్తీర్ణాన్ని

G20లో మోదీ: ప్రపంచానికి 4 ఐడియాలు!G20లో మోదీ: ప్రపంచానికి 4 ఐడియాలు!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న G20 సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా, ప్రపంచవ్యాప్త అభివృద్ధి కోసం నాలుగు కీలకమైన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారతీయ విలువలే ప్రపంచ ప్రగతికి బాటలు