hyderabadupdates.com Gallery టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం post thumbnail image

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన క్ష‌ణాల గురించి చెప్పేందుకు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. గంభీర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భార‌త్ సూప‌ర్ షో చేసింద‌న్నాడు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఆడార‌ని, ఇక సంజు శాంస‌న్ , బుమ్రా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు ర‌విశాస్త్రి. ఇదిలా ఉండ‌గా భారతదేశం 28 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి 2011 ODI ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు శాస్త్రి కామెంటేట‌ర్ బాక్స్ లో కూర్చున్నాడు. 15 సంవత్సరాల క్రితం శ్రీలంకపై జరిగిన ఫైనల్లో మాజీ కెప్టెన్ విజయ సిక్స్ కొట్టినప్పుడు ఆయన చేసిన “ఎంఎస్ ధోని స్టైల్‌గా ముగించాడు” అనే వ్యాఖ్య ఇప్పటికీ అభిమానుల మనస్సుల్లో తాజాగా ఉంది.
కానీ, అహ్మదాబాద్‌లో జరిగిన 2026 T20 ప్రపంచ కప్‌ను భారతదేశం గెలుచు కున్నప్పుడు, శాస్త్రి తన వ్యాఖ్యానంతో అందరినీ నిరాశ పరిచాడన్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. దానిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌ట్టు క‌లిసిక‌ట్టుగా ఆడింద‌ని, ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని పేర్కొన్నాడు. ఇక రికార్డు స్తాయిలో భార‌త్ మూడుసార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. ఫాస్ట్ బౌలింగ్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు కూల్చాడు. కీవీస్ ప‌త‌నాన్ని శాసించాడు. గత మూడు సంవత్సరాలలో రోహిత్ శర్మ నాయ‌క‌త్వంలో, కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భారతదేశం మూడు ICC టైటిళ్లను గెలుచుకుంది.
The post టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా

గుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌నగుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజరాత్ నమూనా స్ఫూర్తితో స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా గుజరాత్ నమూనాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతే