hyderabadupdates.com Gallery స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి post thumbnail image

హైద‌రాబాద్ : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వ సన్నద్ధం కావాల్సిన‌ అవసరం ఉందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించు కోవాలని పోలీసు శాఖకు సూచించారు. ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీస‌ర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి కి వివరించారు.
పోలీసింగ్‌కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం చెప్పారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
శాంతి భద్రతలు కాపాడటంలో దేశంలో తెలంగాణ ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. అందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నా. అయితే, 2047 లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా ఎంపవర్ కావలసిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన విధానం, దానికి చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కూడిన కమిటీని నియమిస్తాం అని ప్ర‌క‌టించారు. ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపాలన పరమైన అంశాలను చర్చించిన తర్వాత చట్టరూపం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
కాగా పోలీసు శాఖను ఎంపవర్ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదన్నారు. కానీ ఫలితాలొచ్చే విధంగా ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు సీఎం. మనకున్న ఫిజికల్ క్రైమ్, మన ఎకోసిస్టమ్ ఆధారంగా మాన్యువల్స్ రాసుకున్నాం. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నేర స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి కొత్త సమస్యలొచ్చాయని తెలిపారు. పోలీసు అధికారులు మొట్టమొదట సమస్య ఏంటో అర్థం చేసుకోగలగితే సగం సమస్య పరిష్కారమైనట్టేన‌ని అన్నారు. సమస్య అర్థం కానప్పుడు వేగంగా పరిష్కరించాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదన్నారు.
The post స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భార‌త పురుషుల స్వ‌దేశీ సీజ‌న్ షెడ్యూల్ రిలీజ్భార‌త పురుషుల స్వ‌దేశీ సీజ‌న్ షెడ్యూల్ రిలీజ్

ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు 2026-27 సంవ‌త్స‌రానికి సంబంధించి భారత పురుషుల స్వదేశీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండ‌ర్ లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు, తొమ్మిది వన్డేలు,

‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కీల‌క‌మైన న‌టుడిగా ఉన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితంటి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం

అహ్మ‌దాబాద్ : త‌న శిక్ష‌ణ‌లో రాటు దేలిన భార‌త జ‌ట్టు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ క‌ప్ ను ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు అంకితం ఇస్తున్నాన‌ని