hyderabadupdates.com Gallery సీనియ‌ర్ సిటిజ‌న్స్ ను చంపేయండి

సీనియ‌ర్ సిటిజ‌న్స్ ను చంపేయండి

సీనియ‌ర్ సిటిజ‌న్స్ ను చంపేయండి post thumbnail image

ఢిల్లీ : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ‌లో సీనియ‌ర్ సిటిజ‌న్ల గురించి గ‌ళం విప్పాడు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ను చంపేయాల‌ని అన్నాడు. దేశాన్ని నిర్మించిన ఈ ప్రజల వైపు ప్రభుత్వం చూడకపోతే వారిని చంపేయడమే బెటర్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. 70 సంవ‌త్స‌రాలు దాటిన సీనియర్ సిటిజన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాయిదాల ప‌ద్ద‌తిన రుణాలు ఇవ్వ‌ర‌ని, డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా ఇవ్వ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. అంతే కాదు బ‌తికేందుకు ఇత‌రుల‌పై ఆధార ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.
రైలు, విమానం ప్రయాణలలో ఇంతకు ముందు ఇచ్చిన 50% రాయతీలు కూడా నిలిపి వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అంతవరకు ఉద్యోగాలలో పన్నులు కట్టిన వారే కదా , అదే రాజకీయాలలో ఉన్న సీనియర్ సిటిజన్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులు, పీఎం, సీఎంలుగా ఉన్న వారికి ఎందుకు అన్ని సౌకర్యాల‌ను, వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ఎంపీ సంజ‌య్ రౌత్.
సీనియర్ సిటిజన్లను బలహీనులుగా చూడవద్ద‌ని కోరారు. వారికి ఓటు హక్కు ఉంద‌ని మ‌రిచి పోవ‌ద్ద‌న్నాడు. ప్రభుత్వాలను మార్చగలరని , వారికి ఉన్న అనుభవంతో ప్రజలను ప్రభావితం చేసేలా వ్యతిరేకంగా ఓటు వేయిస్తే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయని అన్నారు.
ప్రస్తుత కాలంలో తల్లితండ్రులను చూడని పిల్లల సంఖ్యే ఎక్కువ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ్యాంకులు FD వడ్డీ రేట్లు తగ్గించడంతో వారికి వచ్చే ఆదాయం తగ్గిపోయిందన్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర స‌ర్కార్ ను కోరారు.
The post సీనియ‌ర్ సిటిజ‌న్స్ ను చంపేయండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో

స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నంస్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

విజ‌య‌వాడ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి ఆనాడు అక్ర‌మంగా బ‌నాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయింద‌న్నారు. స్కిల్

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యంLokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids : మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా… నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. ఇక ఆయన ఫామ్‌హౌస్‌లో