hyderabadupdates.com Gallery భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీ

భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీ

భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీ post thumbnail image

అస్సాం : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీపై. శ‌నివారం ఆయ‌న అస్సాం రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో నిప్పులు చెరిగారు. దేశం ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంద‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో అండ‌గా నిల‌వాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీ లేని భ‌యాందోళ‌న‌లు రేపుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మోదీ. యుద్ధ సంక్షోభం మధ్య కాంగ్రెస్ భయాందోళనలు వ్యాపింప జేస్తోందని ఆరోపించారు . ప్రపంచ సంఘర్షణలు , ఆర్థిక అంతరాయాల ప్రభావం నుండి భారత పౌరులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని చెప్పారు. అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి పనుల‌కు శంకుస్తాప‌న చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ ప్రపంచ శక్తుల కీలుబొమ్మ‌ వ్యవహరిస్తోందని, భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని అంగీకరించ లేక పోతున్నదని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల మధ్య ప్రతిపక్ష పార్టీ దేశంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని , మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని స్ప‌ష్టం చేశారు మోదీ. ఈ యుద్ధం ప్రభావాన్ని దేశ పౌరులపై తగ్గించడమే మా లక్ష్యం నొక్కి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీల నుండి బాధ్యతా యుతమైన ప్రవర్తన అవసరమని, కానీ జాతీయ ప్రయోజనాల కోసం వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
The post భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న కాంగ్రెస్ : మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌లతీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల

హైద‌రాబాద్ : ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన ఓరుగ‌ల్లు చిర‌కాల వాంఛ తీర‌నుంది. త్వ‌ర‌లోనే ఎయిర్ పోర్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అప్పగించే కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు,

Akshay Kumar Shares Daughter’s Cybercrime Experience, Urges Cyber Education in SchoolsAkshay Kumar Shares Daughter’s Cybercrime Experience, Urges Cyber Education in Schools

Cybercrime has emerged as a major challenge not only for ordinary citizens but also for celebrities, with online fraudsters resorting to tactics such as stealing money from bank accounts, morphing

గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడుగ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడు

అమ‌రావ‌తి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ