hyderabadupdates.com Gallery అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌ post thumbnail image

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు. తామిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి, ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న ప్ర‌ద‌ర్శ‌న గురించి అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్బంగా యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ త‌నకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అభిషేక్ శ‌ర్మ‌కు ఎక్కువ‌గా ఉంద‌న్నాడు. ఇందులో ఎక్కువగా త‌న‌కు ఇండియ‌లోనే కాదు పాకిస్తాన్ లో అమ్మాయిలు త‌న‌ను ఎక్కువ‌గా అభిమానిస్తున్నార‌ని పేర్కొన్నాడు. తాజాగా శాంస‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండ‌గా ఐసీసీ టోర్నీలో తాను రాణించ‌డంపై కూడా స్పందించాడు. ఎందుక‌ని సెంచ‌రీలు చేసేందుకు ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఉప‌యోగించు కోలేద‌న్న ప్ర‌శ్న‌కు సూప‌ర్ స‌మాధానం ఇచ్చాడు. వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే జ‌ట్టు విజ‌య‌మే ముఖ్య‌మ‌ని హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్ప‌ష్టం చేశాడ‌ని ఆ మేర‌కు తాను దేశం కోసం ఆడాన‌ని, సెంచ‌రీల గురించి తాను ఆలోచించ లేద‌న్నాడు సంజు శాంస‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో ఏనాడూ వ్య‌క్తిగ‌త మైల్ స్టోన్స్ గురించి ఆడ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక ఓపెనింగ్ పార్ట‌న‌ర్షిప్ గురించి కూడా స్పందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పొట్టి ఫార్మాట్ లో తామిద్ద‌రి కాంబో వ‌ర్క‌వుట్ అయ్యింద‌న్నాడు. ఇదే కంటిన్యూ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్.
The post అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌

హైద‌రాబాద్ : న‌టి శ్రీ‌లీల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ళ్యాణ్ బంగారు ఆభ‌ర‌ణాల షో రూమ్ ను ఆదివారం మేడిప‌ల్లిలో ప్రారంభించారు. అంత‌కు ముందు భారీ ఎత్తున ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య రిబ్బ‌న్ క‌ట్

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టంBihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

    బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండిఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం