hyderabadupdates.com Gallery ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి post thumbnail image

రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడి తీరుపై ధ్వజమెత్తారు. సాక్షాత్తూ లోక్ సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్రానికే అవమానకరం అని అన్నారు. బయట డ్రగ్స్ నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు, లోపల ఇలాంటి డ్రగ్స్ బానిసలను చట్టసభల్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పట్టుబడిన తర్వాత కూడా పోలీసుల (ఈగిల్ టీం) పైనే కాల్పులు జరపడం గుండా రాజ్యానికి నిదర్శమని అన్నారు.
డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అని తెలిపారు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా ఇంకా తెలుగుదేశం పార్టీ స్పందించక పోవడం దారుణం అన్నారు మార్గాని భ‌ర‌త్. తక్షణమే త‌న‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ నిర్మూలించాలని బయట ప్రచారాలు చేస్తూ.. లోపల మాత్రం అవే డ్రగ్స్ తీసుకుంటూ పట్టు బడటం సిగ్గు చేటు అనిపించ‌డం లేదా అని నిల‌దీశారు మాజీ ఎంపీ.
The post ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కంఆ ముగ్గురు ఆట‌గాళ్లు ఇండియాకు కీల‌కం

ముంబై : ఇండియ‌న్ క్రికెట్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వ‌రుస విజ‌యాల‌ను చ‌వి చూసింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం కీల‌క‌మైన ద‌క్షిణాఫ్రికా

ఏపీ శాస‌న మండ‌లిలో ల‌డ్డూ వివాదం గంద‌ర‌గోళంఏపీ శాస‌న మండ‌లిలో ల‌డ్డూ వివాదం గంద‌ర‌గోళం

అమరావ‌తి : ఏపీ కౌన్సిల్ లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ అంశంపై వివరణాత్మక చర్చకు అనుమతించాలని వైఎస్‌ఆర్‌సిపి చైర్మన్‌ను పదేపదే అభ్యర్థించింది. వైఎస్‌ఆర్‌సిపి సభ్యుల ప్రవర్తనను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా పరిగణించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టిటిడి)

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. రాహుల్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.