hyderabadupdates.com Gallery ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ post thumbnail image

హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ దురంధ‌ర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సినీ విశ్లేష‌కులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నాకు ధురందర్-1 చాలా నచ్చింద‌ని, కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు చిత్రాన్ని మించి పోయిందన్నాడు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ప్రపంచ రూపకల్పన, దర్శకత్వం అన్నీ దోషరహితంగా ఉన్నాయి. కానీ, ఇందులోని భావోద్వేగ భరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన ఆధారాన్ని ఇచ్చాయని స్ప‌ష్టం చేశారు జ‌క్క‌న్న అలియాస్ ఎస్ఎస్ రాజ‌మౌళి.
రచన, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో మలుపులను అద్భుతంగా ఉంద‌న్నాడు . ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కు పోవ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభే కార‌ణ‌మ‌న్నారు. అద్భుతమైన నటన అని పేర్కొన్నారు. షెడ్డులో సోదరితో ఉన్న సన్నివేశం నటనలో ఒక మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుండి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు, హమ్జా జస్కిరత్‌గా మీరిద్దరూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేశారని ప్ర‌శంసించారు.
The post ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రానికి సంబంధించి సినిమా టికెట్ రేట్ల‌ను పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి సీఎస్ అధికారికంగా ఉత్త‌ర్వులు

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధిధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

అమరావతి : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ

రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి