hyderabadupdates.com Gallery ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం

ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం

ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం :  సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. డిసెంబ‌ర్ 6 , 2023 వ‌ర‌కు ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌తి నెల యావ‌రేజ్ గా 89 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌న్నారు. బ‌కాయిల వ‌ల్ల ప్ర‌వైట్ ఆస్ప‌త్రులు మూత ప‌డుతున్నాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.
బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ బ‌కాయిలు పెట్టిందన్నారు. ఈ రోజు వ‌ర‌కు 2408 కోట్ల రూపాయ‌ల‌ను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించిన‌ట్లు వెల్ల‌డించారు సీఎం. ఇందులో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 927 కోట్లు, ప్ర‌వైట్ ఆస్ప‌త్రుల‌కు 1480 కోట్లు చెల్లించడం జరిగింద‌న్నారు. ఈ రోజు వ‌ర‌కు ఉన్న బ‌కాయిలు 727 కోట్లు మాత్ర‌మేన‌ని చెప్పారు.
ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రుగుతున్నాయని తెలిపారు సీఎం.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన బ‌కాయిలే పెండింగ్ లో ఉంటున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు ఆరోగ్య శ్రీ బ‌కాయిలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ చెల్లింపుల‌పైన అపోహ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మ‌ధ్య‌న ఆరోగ్య శ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ విష‌యంలో గ‌తంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. కొంత మంది ఈ స‌హాయ నిధిని దుర్వినియోగం చేశారని, కేసులు కూడా పెట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు. త‌మ‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆన్ లైన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాం అన్నారు. దీని వ‌ల్ల అక్ర‌మాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందన్నారు.
The post ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలుUpendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు.

న‌కిలీ క‌రెన్సీ నోట్ల కేసులో ఏడుగురికి జైలు శిక్షన‌కిలీ క‌రెన్సీ నోట్ల కేసులో ఏడుగురికి జైలు శిక్ష

న్యూఢిల్లీ : ఎన్ఐఏ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 2015లో విశాఖ‌లో జ‌రిగిన నిక‌లీ భార‌త క‌రెన్సీ నోట్ల కేసులో 7 మంది నిదుల‌కు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. UA (P) చట్టంలోని వివిధ నిబంధనల కింద అరెస్టు

బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలిబీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

అమరావతి : బీసీ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మరో రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని, ఈలోగా హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్