hyderabadupdates.com Gallery ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’

ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’

ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’ post thumbnail image

హైద‌రాబాద్ : ఉప్పెన మూవీతో సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. త‌న కెరీర్ లో మ‌రో కీల‌క‌మైన చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది . ఆ సినిమానే పెద్ది. ఇప్ప‌టికే అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాడు. గ్లింప్స్, పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ సాంగ్స్. ఇక స‌న్నివేశాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత అంత‌కు మించి అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశాడు మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్. త‌న‌తో ముంబై అందాల సుంద‌రి జాహ్న‌వి క‌పూర్ కీ రోల్ పోషిస్తోంది.
పెద్ది మూవీలో మ‌రో ముఖ్య‌మైన పాత్ పోషించాడు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరో శివ రాజ్ కుమార్. సినిమాపై మ‌రింత హోప్ పెంచేలా చేసింది. పెద్ది మూవీని ఆట నేప‌థ్యంలో తీర్చిదిద్దాడు. చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా పూర్తిగా క్రికెట్ నేప‌థ్యంలో తీస్తున్నార‌ని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ తో పాటు చాలా ఆట‌ల‌ను ఇందులో చిత్రీక‌రించిన‌ట్లు టాక్. ఇందులో ప్ర‌ధానంగా కుస్తీ కూడా ఉంది. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే గ్లింప్స్ లో ‘కుస్తీ’ పై ఫోక‌స్ చేశారు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, లుక్‌.. మ‌రోసారి ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని చ‌ర‌ణ్ ని బుచ్చిబాబు ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడ‌న్న ధీమా మ‌రోసారి క‌లిగింది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ ఖాయ‌మంటూ మ‌రోసారి నిర్మాత‌లు ధైర్యంగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.
The post ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ajit Pawar: చిక్కుల్లో అజిత్‌ పవార్‌ కుమారుడుAjit Pawar: చిక్కుల్లో అజిత్‌ పవార్‌ కుమారుడు

  మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌కు చెందిన కంపెనీ… పుణెలో భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి రెవెన్యూ అడిషనల్‌

YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ సందర్శన కోసం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్‌ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దంవ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై