hyderabadupdates.com Gallery దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి

దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి

దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి post thumbnail image

హైద‌రాబాద్ : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. త‌ను సామాన్యంగా ఏ వ్య‌క్తుల‌ను, సినిమాల‌ను ప్ర‌శంసించ‌రు. కానీ గ‌త కొంత కాలంగా దురంధ‌ర్ -1, దురంధ‌ర్ సీక్వెల్ మూవీ గురించి ప‌దే ప‌దే పేర్కొంటూ దానిని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. చిత్ర పరిశ్రమ కింద ఒక అణుబాంబును పేల్చిన తర్వాత, మిగతా చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న నిశ్శబ్దం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పేర్కొన్నారు.
ప్ర‌ధానంగా దురంధ‌ర్ -2 మూవీ సృష్టించిన ఈ విధ్వంసకరమైన విస్ఫోటనం చిత్ర పరిశ్రమలోని మిగతా వారందరినీ అంతరిక్షంలోకి విసిరేసిందని అన్నారు ఆర్జీవీ. ఆ సుదూర ప్రాంతాల వల్ల వారి చప్పట్లు ఇక్కడికి చేరలేవని ఇలా జరుగుతోందా, లేక వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించకుండా, “ఇది కేవలం ప్రచారం… త్వరలోనే ఇది పోతుంది,” అని ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ, వెనక్కి పాకుతూ వెళ్లి తమ పాత, రొటీన్ సినిమాలనే మళ్ళీ తీయడం మొదలుపె ట్టాలనుకుంటున్నారా, నాకేమీ తెలియడం లేదని పేర్కొన్నారు ఆర్టీవి.
లేక, ఆ సినిమా అద్భుతమైన ప్రతిభకు నిశ్చేష్టులైపోయి, తాము ఇప్పటి వరకు తీస్తున్నా లేదా తీయాలని అనుకుంటున్నా, ఏ సినిమా కూడా ఇప్పుడు దీనికి సాటి రాదని గ్రహించారా అని ప్ర‌శ్నించారు. కానీ, కళ్లెదుటే నిలబడి, బాక్సాఫీస్ వద్ద నేలనే కంపింప జేస్తున్న, గర్జనతో కళ్లలో నిప్పులు కక్కుతున్న ధురందర్2 లాంటి డైనోసార్‌ను పట్టించు కోక పోవడం అత్యంత అవివేకం కాదా? అని నిల‌దీశారు. సినీ పరిశ్రమలోని నా సహోద్యోగులందరికీ నా మనస్ఫూర్తి సలహా ఏంటంటే, దయచేసి ధురందర్2ను అత్యంత తీవ్రంగా తీసుకోండి. సినిమా నిర్మాణంలో ఒక సరికొత్త కోర్సులా దీన్ని అధ్యయనం చేసి, మిమ్మల్ని మీరు విద్యావంతులుగా చేసుకోండి అని సూచించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
The post దర్శ‌కులు ధురంద‌ర్ ను చూసి నేర్చుకోవాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసుKarur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు

Karur Stampede : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.

ఏం ఉద్ద‌రించార‌ని సావ‌ర్క‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి..?ఏం ఉద్ద‌రించార‌ని సావ‌ర్క‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి..?

న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మ‌రాఠా వేదిక‌గా జ‌రిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవ‌త్స‌రం సంద‌ర్బంగా నిర్వ‌హించిన కీల‌క స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వీర సావ‌ర్క‌ర్ కు కేంద్ర స‌ర్కార్

నెలాఖ‌రు లోగా లక్ష ఇందిర‌మ్మ ఇళ్ల గృహ ప్రవేశాలునెలాఖ‌రు లోగా లక్ష ఇందిర‌మ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నెలాఖ‌రు లోగా ల‌క్ష ఇళ్ల‌లో గృహ ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక లో భాగంగా