చెన్నై : తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా సినీ రంగంలో విపరీత ధోరణలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఆయన పరోక్షంగా ఆదిత్య ధర్ తీసిన దురంధర్ మూవీ గురించి స్పందించారు. ఈ మధ్య వరుసగా విద్వేష ప్రచారానికి ప్రయారిటీ ఇస్తూ సినిమాలు వస్తున్నాయని ఆరోపించారు. ఏ ప్రాజెక్ట్ పేరు ప్రస్తావించకుండా ప్రచారానికి ప్రజల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే శక్తి ఉందని అన్నారు. అందుకు ఉదాహరణగా పెద్ద నోట్ల రద్దును వెట్రిమారన్ పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్వేష ప్రచార చిత్రాలను విమర్శించడంతో చర్చకు తెరలేపారు. అభిమానులు ఆయన వ్యాఖ్యలను ధురందర్ 2తో ముడిపెట్టారు. నీలిర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
హింస లేదా ద్వేషంతో వందల కోట్లు సంపాదించాలనే ఆశతో, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించే సినిమాలు చాలా ఉన్నాయన్నారు వెట్రి మారన్. ఈ రోజుల్లో ప్రతీదీ ప్రచారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారానికి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే శక్తి ఉందన్నారు. దీనికి ఉదాహరణగా పెద్ద నోట్ల రద్దును వెట్రిమారన్ పేర్కొన్నారు. జ్ఞాపకాలు చాలా చంచలమైనవి, ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితమయ్యారో, ప్రజలు బారులు తీరినప్పుడు ఎన్ని ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ మనం దాని ప్రభావాన్ని సులభంగా మార్చగలం. కాబట్టి, విద్వేష ప్రచారానికి వ్యతిరేకంగా మనం ఏమి చేయగలం? అని అన్నారు దర్శకుడు.
The post విద్వేష ప్రచారం అత్యంత ప్రమాదకరం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
విద్వేష ప్రచారం అత్యంత ప్రమాదకరం
Categories: