hyderabadupdates.com Gallery రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట

రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట

రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట post thumbnail image

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు, ఇంకోసారి మావిగన్ అంటారు… తాను ఉంటున్న లోటస్ పాండ్ ప్యాలెస్ కూడా రాజధానే అని అంటున్నారు… జగన్ కు మంచి వైద్యం అందించాలని స్వయాన వైసీపీ నాయకులు గొణుక్కుంటున్నారంటూ ఎద్దేవా చేశారు . తన పార్టీ ఉనికి కోసమే జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించు కోవడం లేదన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజతో పాటు రూ.6 లక్షలతో నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఘనగిరి పూల మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పూల వ్యాపారులను ప్రోత్సహించేలా పూల మార్కెట్ ను ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి స‌విత‌. ఇప్పటికే రూ.5 కోట్లతో చేపట్టిన పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకశిర రోడ్ వరకు కూడా సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. . గంటకో మాట మార్చే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం పూట‌కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే వ్యక్తి జగన్ అని మంత్రి సవిత విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
The post రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్

శేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నంశేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహ నసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమేపోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తో పాటు పనుల వేగం పై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎం ఎల్ కాంతారావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని