hyderabadupdates.com Gallery క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం post thumbnail image

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఈసారి ఒంటిమిట్ట‌లో నిర్వ‌హించిన వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు నిన్న‌టితో ధ్వ‌జారోహ‌ణంతో ముగిశాయి. ఈ సంద‌ర్బంగా చేప‌ట్టిన శ్రీ కోదండ రాముడి క‌ళ్యాణోత్స‌వానికి రికార్డు స్తాయిలో భ‌క్తులు హాజ‌ర‌య్యారు. స్వామి అమ్మ‌వార్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కుటుంబీకులు ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివ రావు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

    ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw : బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా (Kiran Majumdar Shaw) ఇటీవల ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత్‌ లో

సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదంసోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు