hyderabadupdates.com Gallery సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు post thumbnail image

సిద్దిపేట జిల్లా : తెలంగాణలో కొలువు తీరిన ప్ర‌జా పాల‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో రూ.700 కోట్ల సీబీజీ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాజెక్టును జూనో జౌల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంద‌ని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ‘కంప్రెస్డ్ బయో-గ్యాస్’ ప్లాంట్‌ ఏర్పాటు కోసం శంకుస్థాప‌నం చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు శ్రీ‌ధ‌ర్ బాబు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య విశేషాలలో ఒకటి ఏమిటంటే, దీని ద్వారా సుమారు 1,400 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పనిచేసేవారిలో 30 శాతం మంది మహిళలే ఉంటారని వెల్ల‌డించారు మంత్రి దుద్దిళ్ల‌. ఇది సమ్మిళిత వృద్ధి పట్ల ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మూడు దశల్లో, క్లస్టర్-ఆధారిత నమూనాలో అమలు చేయబడుతుందని చెప్పారు. ఒక్కోటి రోజుకు 100 టన్నుల సామర్థ్యం కలిగిన మొత్తం 10 సీబీజీ ప్లాంట్లు అభివృద్ధి చేయబడతాయ‌ని వెల్ల‌డించారు. మొదటి , రెండవ దశల్లో ఒక్కోదానిలో మూడు ప్లాంట్ల చొప్పున, మూడవ దశలో నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తార‌న్నారు. ఈ ప్లాంట్లు వరి గడ్డి, పశువుల పేడ , కోళ్ల వ్యర్థాల వంటి సుస్థిర ముడి పదార్థాలను ఉపయోగించి బయో ఫ్యూయల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయని స్ప‌ష్టం చేశారు.
The post సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలుDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

    ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)