hyderabadupdates.com Gallery న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్ post thumbnail image

హైద‌రాబాద్ : న‌టి అన‌న్య నాగళ్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో పాటు మ‌రో న‌టి విష్ణుప్రియ భీమ‌నేని ఇద్ద‌రిపై పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కొన‌సాగుతోంది. ఈ ఇద్ద‌రూ ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా సబ్‌స్క్రిప్షన్ కు శ్రీ‌కారం చుట్టార‌ని, దీని ద్వారా త‌మ‌కు సంబంధించిన అందాల‌ను ఆర‌బోసే కార్య‌క్ర‌మం స్టార్ట్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ప్ర‌జా సంఘాల‌కు చెందిన నాయ‌కులు, విద్యార్థి నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
ఇదే కోవ‌లో తాను కూడా త‌క్కువ కాదంటూ అన‌న్య నాగ‌ళ్ల సైతం ఇన్ స్టాగ్రామ్ లో స‌బ్ స్క్రిప్ష‌న్ కు తెర లేపింది. దీనిపై ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. ఇదేం దందా అంటూ మండిప‌డ్డారు. అవ‌కాశాలు రాక‌పోతే వేరే ప‌ని చేసుకోవాలే త‌ప్పా ఇలా అందాల‌ను ఎర‌గా వేసి యువ‌త‌ను చెడ‌గొడితే ఎలా అని ప్ర‌శ్నించారు. దీనిపై తీవ్ర దుమారం చెల‌రేగ‌డంతో న‌టి అన‌న్య నాగ‌ళ్ల క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇందుకు సంబంధించి 2025లోనే సబ్‌స్క్రిప్షన్‌ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్ చేసింది అనన్య నాగ‌ళ్ల‌.
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని.. అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. తాను ఏమీ అందాల‌ను ఆర బోయ‌డం లేద‌ని పేర్కొంది. ఎవ‌రైనా స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చ‌ని, అది త‌మ వ్య‌క్తిగ‌త‌మ‌ని, దానిని ప్ర‌శ్నించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌మ గురించి మాట్లాడటం కంటే ఇత‌ర సినీ హీరోయిన్ల గురించి కూడా మాట్లాడితే బెట‌ర్ అని పేర్కొంది.
The post న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్

నేపాల్ : నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చెల‌రేగిన త‌రుణంలో నేపాల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ త‌రుణంలో దేశ ప్ర‌ధాన‌మంత్రిగా అతి పిన్న వ‌య‌సు క‌లిగిన బాలేంద్ర షా బాలెన్ కొలువు తీరారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 35 ఏళ్లు మాత్ర‌మే. ఆయ‌న‌పై

ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళిప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళి

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌ట్టిలో మొల‌కెత్తిన గొంతుక‌, ప్ర‌జా స్వ‌ర‌పేటిక గుమ్మ‌డి విఠ‌ల్ రావు అలియాస్ గ‌ద్ద‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు. కానీ త‌ను పాడిన పాట‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఉంటాయి. మ‌న‌ల్ని గాయ‌ప‌రుస్తూనే ఉంటాయి. చ‌ని

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదంAP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇవాళ జరిగిన