hyderabadupdates.com Gallery జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్

జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్

జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్ post thumbnail image

త‌మిళ‌నాడు : దేశంలోని త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌ధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డారు. త‌మిళ‌నాడులో ఒకే రోజు 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ కొన‌సాగుతోంది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో రెండు విడతులుగా పోలింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది ఈసీ. అత్యంత‌ కట్టుదిట్టమైన భద్రత నడుమ 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సామాన్య పౌరులు లాగానే త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ప్ర‌ముఖ న‌టుడు , ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ త‌న కూతురు, న‌టి శృతి హాస‌న్ తో క‌లిసి ఓటు వినియోగించుకున్నారు. త‌లైవా ర‌జ‌నీకాంత్, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, న‌టి సుహాసిని, ఖుష్బు, సుంద‌ర్ , ఇలా చాలా మంది ఓటు వేశారు.
ఇక ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన కొత్త పార్టీ పెట్టిన ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ స్వ‌యంగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయ‌న రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన, కీలకమైన పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) వ్యవస్థలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ధృవీకరించు కోవడానికి, తెల్లవారు జామున మాక్ పోలింగ్ నిర్వహించారు. కరూర్‌లోని బూత్ నంబర్ 135 వద్ద, అసలు ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ చేప‌ట్టారు.
తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలకమైన ఎన్నికల్లో మొత్తం 5.73 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులు. వివిధ రాజకీయ పార్టీలు, కట్టుదిట్టమైన పర్యవేక్షణలో రోజంతా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. మార్గదర్శకాలను పాటిస్తూ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల క‌మిష‌న్ కోరింది.
The post జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములుశ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంCM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది.