hyderabadupdates.com Gallery ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ

ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ

ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రెండు రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.
గురువారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల్లో(10) తీవ్ర వడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇవాళ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 44.1°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 43.4°C, పల్నాడు(జి) బెల్లంకొండలో 43.3°C, మార్కాపురం(జి) నందనమారెళ్ళలో 43.2°C, చిత్తూరు(జి) గంగవరం 42.8°C, కర్నూలు(జి) నగరడోనలో 42.7°C, తిరుపతి(జి) దొరవారిసత్రంలో 42.5°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 42.4°C, మన్యం(జి) మక్కువ, పోలవరం(జి) విఆర్ పురంలో 42.2°C, నంద్యాల(జి) చాగలమర్రి, ప్రకాశం(జి) కొప్పెరపాడు, వైఎస్సార్ కడప(జి) లింగాలలో 42.1°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 42 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
The post ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి : గ‌త తొమ్మిది రోజుల పాటు నిర్వ‌హిస్తూ వ‌స్తున్న శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు సోమ‌వారం నాటితో ముగిశాయి. ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖ శాంతులతో ఉండడానికి చక్రస్నానం

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులుPawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

    అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలిమెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా