hyderabadupdates.com Gallery కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!

కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు “లాటరీ కింగ్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.

నాగార్జునకు ఇది మైలురాయి లాంటి సినిమా కావడంతో ఇందులోని ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండబోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియర్ నటి టబూ కనిపించనుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ్–టబూ జంట గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత వారు ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ తర్వాత ఈ జంట మరోసారి కలిసి కనిపించలేదు.

ఇప్పుడీ మైల్‌స్టోన్ సినిమా కోసం మళ్లీ టబూను ఎంపిక చేశారన్న వార్త బయటకు రావడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
The post కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది అభ్యర్ధులుJubilee Hills: జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది అభ్యర్ధులు

    హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉండగా, పురుషులు- 2,08,561,

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

    కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.