hyderabadupdates.com Gallery Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు post thumbnail image

 
 
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై స్థానిక సబ్-డివిజినల్ అధికారి (SDO) ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు గట్టి పట్టున్న రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఎలాగైతే అమేథీలో ఓడిపోయారో అలాగే తేజస్విని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కిశోర్ తెలిపారు. ‘మీ ఎమ్మెల్యే రెండు సార్లు ఉపముఖ్యమంత్రి అయ్యారు. మీ సమస్యలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు’ అంటూ తన ఎన్నికల ప్రసంగంలో తేజస్విపై పీకే విమర్శలు గుప్పించారు.
దీనికి ముందు పాట్నా నుంచి రఘోపూర్‌కు ప్రశాంత్ కిశోర్ బయలుదేరుతూ, తేజస్వి ఈసారి రెండు సీట్లలో పోటీ చేస్తారని తెలుస్తోందని, ఆయనకు అంత భయమైతే రెండు చోట్లా పోటీ చేయవచ్చని, రాహుల్ గాంధీ 2019లో రెండు సీట్లలో పోటీ చేసిన అమేథీలో ఓడిపోయినట్టే రఘోపూర్‌లోనూ తేజస్వికి ఓటమి తప్పదన్నారు. తేజస్విపై పోటీ చేసే అవకాశంపై అడిగినప్పుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు. జన్ సురాజ్ పార్టీ సెంట్రల్ కమిటీ ఆదివారంనాడు సమావేశమవుతుందని, రఘోపూర్ ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆదారంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.
The post Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty ResponseSonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty Response

Bollywood actress Sonakshi Sinha has finally addressed the persistent rumours surrounding her pregnancy in a humorous way. The actress, who recently attended an event with her husband Zaheer Iqbal, found

పేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కంపేద బ్రాహ్మ‌ణుల కోసం ‘గరుడ’ ప‌థ‌కం

అమ‌రావ‌తి : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏపీ స‌ర్కార్. పేద బ్రాహ్మణ కుటుంబాల కోసం త్వరలో గరుడ పథకాన్ని ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్రబాబు నాయుడు. మరణించిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు తక్షణమే రూ. 10,000 సహాయం

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు