hyderabadupdates.com Gallery Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా post thumbnail image

Amit Shah : బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను మోదీ ‘బిగ్‌ మ్యాన్‌’ చేస్తారని అన్నారు. సామ్రాట్‌ పోటీ చేస్తున్న తారాపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ను తప్పించి, బీజేపీ అభ్యర్థికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందని గతంలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amit Shah Comments
‘‘సామ్రాట్‌ చౌధరీ పుట్టింది ఇక్కడే. సామ్రాట్‌ కోసం ఈ స్థానాన్ని వదులుకోవాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే (జేడీయూ) రాజీవ్‌ సింగ్‌ను ఒప్పించాము. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తారాపుర్‌ సహా అనేక ప్రాంతాల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే మాత్రం రెడీమేడ్‌ డిప్యూటీ సీఎం’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ఎన్నికల్లో సామ్రాట్‌కు ఓటు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో ఆయన్ను ప్రధాని మోదీ ‘‘బిగ్‌ మ్యాన్‌, వెరీ బిగ్‌ మ్యాన్‌’’ చేస్తారని చెప్పారు.
బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్‌ చౌధరీ.. గతంలో జేడీయూ, ఆర్జేడీ పార్టీల్లోనూ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. సామ్రాట్‌ కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి చేరువయ్యే వ్యూహంలోనే సామ్రాట్‌కు భాజపా ప్రాధాన్యం కల్పిస్తోందనే వాదన కూడా ఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన.. చాలాకాలం తర్వాత ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.
Also Read : BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన
The post Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటనAP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

    విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని… ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యంLokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids : మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా… నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. ఇక ఆయన ఫామ్‌హౌస్‌లో