hyderabadupdates.com Gallery AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు post thumbnail image

 
విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి డీఆర్వో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీవో నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కు లేఖ రాశారు.
మరోవైపు… పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఆర్డీవోకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆర్డీవో, డీఆర్వోలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హెచ్‌బీసీఎల్‌ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.విద్యాసాగర్‌కు విశాఖ ఆర్డీవోగా బాధ్యతలు అప్పగించారు. డీఆర్వో బాధ్యతలను విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర అశోక్‌లకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే ఆర్డీవో, డీఆర్వోలను రిలీవ్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
The post AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం

PM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీPM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీ

    పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని… సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా… ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

    బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను