hyderabadupdates.com Gallery Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం post thumbnail image

 
 
బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా అధికార ‘ఎన్డీయే’కు బిహారీలు మరోసారి పట్టం కట్టనున్నట్లు పేర్కొన్నాయి. అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని తెలిపాయి.
బిహార్‌లో అధికార ఎన్డీయే 133-159 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేసింది. మహాగఠ్‌బంధన్‌కు 75-101 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీకి 0-5 స్థానాలు, ఇతరులు 2-8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.
దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీయేకు 145-160 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 73-91 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీయేకు 147-167, విపక్షాలకు 70-90 స్థానాలు, ఇతరులకు 2-8 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్‌ అంచనా వేసింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ కూడా ఎన్డీయేకు 133-148, విపక్షాలకు 87-102 సీట్లు, ఇతరులకు 3-6 వస్తాయని పేర్కొంది. జన్‌సురాజ్‌ పార్టీ 0-2 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి.
 
The post Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వంఅంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వం

విశాఖ‌ప‌ట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా విశాఖ ఉత్స‌వం కొన‌సాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్‌ను రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’

Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Surekha : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

    పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర