hyderabadupdates.com Gallery Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్ post thumbnail image

 
 
హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్‌ మాథ్యూస్‌ ఫెర్రెరో ఫొటోలకు 2017లో అలా పోజులిచ్చిందంతే! అది తప్ప ఆమె మోడలింగ్‌ చేసిన ఫొటోలు మరేవీ లేవు. రాహుల్‌ తన మీడియా సమావేశంలో ఆమె ఫొటోను ప్రదర్శించి.. ‘ఈమె ఎవరు?’ అని ప్రశ్నించడంతో నెటిజెన్లంతా ఆమె ఆచూకీ కోసం గూగుల్‌లో, ఇన్‌స్టా, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తెగ గాలించారు. రాహుల్‌ ప్రదర్శించిన ఫొటో ఆధారంగా ఇమేజ్‌ సెర్చ్‌ కూడా చేశారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ తెలియరాలేదు.
అయితే.. తన ఫొటో ఇంటర్‌నెట్‌లో సెన్సేషన్‌గా మారడంతో లారిస్సా నెరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా స్పందించింది. అది తన పాత ఫొటో అని.. ఆ ఫొటో తీసే సమయానికి తన వయసు 18-20 ఏళ్లని తెలిపింది. ‘‘గైస్‌.. అది పాత ఫొటో.. ఇండియాలో ఎన్నికల కోసమో.. ఓటింగ్‌కు సంబంధించో.. నా ఫొటోను వాడుకుంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి నన్ను భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారు. ఇదేం పిచ్చి? ఇదేం వెర్రి? దేవుడా.. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం’’ అని నవ్వుతూ ఆశ్యర్యం వెలిబుచ్చింది. తాను ప్రస్తుతం ఒక సెలూన్‌లో పనిచేస్తున్నానని.. తన ఫొటో వైరల్‌ కావడంతో ఒక పాత్రికేయుడు తాను పనిచేస్తున్న సెలూన్‌కు ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ కోసం కూడా అడిగాడని తెలిపింది.
The post Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుKinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని.. అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్.

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

హెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దుహెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజంలో రోజు రోజుకు హెచ్ ఐ వీ బాధితులు పెరిగి పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కానీ వారి ప‌ట్ల ప్రేమ పూర్వ‌కంగా ఉండాల‌ని