hyderabadupdates.com Gallery BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు

BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు

BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు post thumbnail image

 
 
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఎన్నిక అనివార్యమవగా… సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో నిలిపింది. సెంటిమెంట్‌తో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలని భావించినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కే పట్టంకట్టారు. ఫలితంగా ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఉప ఎన్నికలో ఓటమికి కారణాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బైపోల్స్‌లో ఓటమిపై కార్యకర్తల నుంచి కేటీఆర్‌ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సొంత పార్టీ నాయకుల్లో కొందరు.. కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పలువురు కార్యకర్తలు ఆరోపించారు. సొంత పార్టీ నేతలు సరిగా పనిచేయకపోవడం వలనే బీఆర్ఎస్ ఓడిపోయిందని గులాబీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. స్థానిక నేతలు, జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఓటమికి కారణమని నేతలకు చెప్పారు.
స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలు బైపోల్స్‌ను పెద్దగా పట్టించుకోలేదని… నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్‌ను ఎదుర్కోలేకపోవటం కూడా ఓటమికి కారణమని సమావేశంలో బీఆర్‌ఎస్ క్యాడర్ పేర్కొంది.
The post BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందంHAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

    కేంద్ర ప్రభుత్వ హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అమెరికా రక్షణ రంగ సంస్థ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఏరోస్పేస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎంకే1ఏ కార్యక్రమం కింద తేజస్‌ విమా నాలకు అవసరమైన 113 జెట్‌ ఇంజిన్లను

దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టుదంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడ‌మే కాకుండా వీడియోలు తీయ‌డం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు న‌మోదైంది.