hyderabadupdates.com Gallery Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం !

Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం ! post thumbnail image

Children Hostage : ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్‌ పేరుతో కిడ్నాప్‌ కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. రెస్క్యూ ఆపరేషన్‌ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Children Hostage News Update
సినిమా,డైలీ సీరియల్స్‌,వెబ్‌ సిరీస్‌లో బాల నటీనటులు కావాలంటూ ముంబయి పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్‌ స్టూడియోలో రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఓ యాడ్‌ ఇచ్చాడు. ఆ యాడ్‌ చూసిన 100 మంది పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఉన్న ఆర్‌ఏ స్టూడియోకు తరలివచ్చారు. 8-14 ఏళ్ల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులు స్టూడియోకు వచ్చారు. కొంత సమయం తర్వాత చిన్నారులను బయటకు పంపించిన రోహిత్‌.. కొంత మందిని మాత్రం బంధించాడు. అయితే పిల్లల్ని బంధించిన అనంతరం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్య మాట్లాడుతూ… ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్‌ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్‌ మార్చి పిల్లల్ని కిడ్నాప్‌ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.
ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ముంబై (Mumbai) పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టూడియో పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి చెరలో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా వ్యహరించారు. నిందితుడికి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని విడిచి పెట్టేందుకు అతడు నిరాకరించాడు. చిన్నారులకు హాని కలిగిస్తానని బెదిరించడంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందం… బాత్‌రూమ్‌ ద్వారా లోనికి ప్రవేశించి 17 మంది చిన్నారులు సహా 19 మందిని సురక్షితంగా రక్షించింది. ఆ సమయంలోనే నిందితుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఎయిర్‌గన్‌, కొన్ని రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో రోహిత్‌ ఆర్య మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?
The post Children Hostage: ముంబైలో పిల్లల కిడ్నాప్‌ కథ సుఖాంతం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమలSabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

    కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన

Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌Red Alert: ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీElection Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ

Election Commission : తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్‌ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు