hyderabadupdates.com Gallery CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు

CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు

CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు post thumbnail image

 
 
యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో… అబుదాబీ ఛాంబర్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ జాసిమ్‌ అల్‌ జాబీ, జీ 42 సీఈవో మాన్సూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ఏపీ పయనిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం… అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చెప్పారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్‌ఓసీ ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం నెట్‌వర్క్‌ లంచ్‌లో పాల్గొంది.
 
అబుదాబిలో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ‌లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు ముఖ్యమంత్రి. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అనంతరం అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో నెట్‌వర్క్ లంచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొన్నారు. నెట్‌వర్క్ లంచ్‌లో జీ-42 సీఈవోతో, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యూఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.
The post CM Chandrababu: జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు – సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్యPregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్య

    కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలంలో దారుణం చోటు చేసుకుంది. గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ హత్య చేశాడు. గొడ్డలి, కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. సత్యనారాయణ కుమారుడు

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌నగవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర

YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన 

రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం పర్యటించారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా