hyderabadupdates.com Gallery Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట post thumbnail image

Indian Navy : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. నావికా దళ సిబ్బందిప్రతిభావంతులని… సృజనాత్మకత కలిగిన వారని ప్రశంసించారు. వారు రాసిన ‘కసమ్‌ సిందూర్‌కి’ (Kasam Sindoor Ki) గీతం ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతుందని అన్నారు.
Indian Navy Updates
ఈ పాటలో పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో త్రివిధ దళాలు కలిసి ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులు, ఉగ్రస్థావరాలను సమూలంగా నాశనం చేసిన భారత స్వదేశీ క్షిపణులు వంటి వివిధ విషయాలను ప్రస్తావించారు. ‘విక్రాంత్‌’పై మోదీ దీపావళి వేడుకలు గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ (Indian Navy) సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు.
Also Read : RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల
The post Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: మొంథా తుపాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం – సీఎం చంద్రబాబుCM Chandrababu: మొంథా తుపాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం – సీఎం చంద్రబాబు

      మొంథా తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా

Sobha Group Pledges ₹100 Crore for World-Class Library in Amaravati, CM Naidu Expresses GratitudeSobha Group Pledges ₹100 Crore for World-Class Library in Amaravati, CM Naidu Expresses Gratitude

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu recently conducted an important meeting with PNC Menon, Sobha Group chairman and founder of the Dubai-based leading real estate development company. In a

గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌నగాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న‌కు తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం