hyderabadupdates.com Gallery IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ post thumbnail image

 
 
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలానే ఇవాళ(మంగళవారం) కూడా హైదరాబాద్ లో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇలా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌ సస్పెన్షన్‌
 
విద్యార్థుల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మెళియాపుట్టి మండలం బందపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్‌ చేస్తూ సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి… వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని టెక్కలి ఆర్డీఓను సీతంపేట ఐటీడీఏ పీఓ ఆదేశించారు.
The post IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలుSudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు

  సూడాన్‌ సైన్యం, సూడాన్‌ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ లో సూడాన్‌

Priyank Kharge: ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గేPriyank Kharge: ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే

Priyank Kharge : బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన సమీకరణల పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వంటి ప్రముఖులకు ఎదురైన చారిత్రక చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమని