hyderabadupdates.com Gallery Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

 
విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది. హైదరాబాద్​ లేదా చెన్నై మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవాడ నుంచే డైరెక్ట్ గా ప్రయాణించవచ్చు. ఇక ఫ్లైట్ టికెట్‌ ధర కేవలం రూ.8 వేలు మాత్రమే కావడం విశేషం. సాధారణంగా సింగపూర్‌ కు ప్రయాణించాలంటే… కనీసం రూ.15 నుంచి 20 వేలు వరకు ఖర్చవుతుంది. ఈ సర్వీసుతో కేవలం రూ.8 వేలకు ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
 
సింగపూర్‌ నుంచి బయలుదేరే విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ ఇంటర్నేషనర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. తిరిగి ఇక్కడి నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుందని వివరించింది. సుమారు నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపింది. విజయవాడ నుంచి ప్రయాణం… అందులోనూ సౌకర్యవంతమైన సమయాలు, తక్కువ టికెట్ ధర కావడంతో వ్యాపారవేత్తలు, పర్యాటకులు, విద్యార్థులు అందరికీ ఈ మార్గం అనుకూలంగా మారనుంది. వారానికి మూడు రోజులు(మంగళవారం, గురువారం, శనివారం) ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 180 నుంచి 230 సీట్లు కలిగిన ఇండిగో బోయింగ్‌ ఫ్లైట్ లతో సర్వీసులు నడువనున్నాయి. తొలుత వారానికి మూడు సార్లు మాత్రమే నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరిగితే రోజువారీ సర్వీసు నడిచేవిధంగా చర్యలు తీసుకుంటామని సంస్థ సిబ్బంది తెలిపారు.
The post Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలుRabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi : బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి (Rabri Devi) తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.