hyderabadupdates.com Gallery Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం post thumbnail image

 
 
భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇదొక గేట్‌వే అని ముయిజ్జు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇది ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే కాదని, ఆర్థిక పరివర్తనకు చిహ్నమని అభివర్ణించారు. భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందనేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఒక చిహ్నమని ముయిజ్జు పేర్కొన్నారు. దీనిపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ‘‘పురోగతి, శ్రేయస్సుకు ఇదొక చిహ్నం. పొరుగు వారికి తొలి ప్రాధాన్యం, మహాసాగర్‌ విజన్‌లో భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’’ అని రాసుకొచ్చింది.
 
 
హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత ప్రజల శుభాకాంక్షలను నేను ఆయనకు తెలియజేశాను. ఈ విమానాశ్రయం రెండు దేశాల మధ్య స్నేహం మరియు ఆప్యాయతకు నిదర్శనం అవుతుంది, అలాగే భారతదేశం మరియు మాల్దీవులు చేపడుతున్న అనేక ఉమ్మడి ప్రాజెక్టులలో ప్రేరణగా నిలుస్తుంది. ప్రజల మధ్య బలమైన సంబంధాలు మరియు ఉమ్మడి శ్రేయస్సు కోసం, మన దేశాల మధ్య మెరుగైన వాయు అనుసంధానం ఏర్పరచే అన్ని అవకాశాలను మేము చర్చించాము.
ఇటీవల మాల్దీవుల పర్యటనలో భాగంగా,మాల్దీవులలో పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని అక్కడ వివిధ రంగాల్లో చేస్తున్న వారి పని గురించి తేలుసుకున్నాను. భారతీయ ప్రవాసులు మన దేశం అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. వారు భారతదేశానికి మరియు ప్రపంచానికి మధ్య బలమైన వారధిగా కొనసాగుతున్నారు. మీ నిబద్ధత, శ్రమ, మరియు కృషి శ్రీకాకుళం మాత్రమే కాదు, మన దేశానికి కూడా గర్వకారణం. మేము మీ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం మరియు భవిష్యత్తులో కలిసి మరిన్ని గొప్ప విజయాలను సాధించేందుకు ఆశిస్తున్నాం అని కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు తెలిపారు.
The post Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేతUttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది

Pawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore ClubPawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore Club

Power Star Pawan Kalyan’s latest release OG has demonstrated the box-office potential of a well-planned, straight commercial entertainer. Directed by young filmmaker Sujeet, the film has already grossed over ₹250

Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతుHarsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

Harsh Goenka : భారత సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణించే బెంగళూరులో రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన పోస్టులు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు