hyderabadupdates.com Gallery Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం post thumbnail image

 
 
భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇదొక గేట్‌వే అని ముయిజ్జు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇది ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే కాదని, ఆర్థిక పరివర్తనకు చిహ్నమని అభివర్ణించారు. భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందనేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఒక చిహ్నమని ముయిజ్జు పేర్కొన్నారు. దీనిపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ‘‘పురోగతి, శ్రేయస్సుకు ఇదొక చిహ్నం. పొరుగు వారికి తొలి ప్రాధాన్యం, మహాసాగర్‌ విజన్‌లో భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’’ అని రాసుకొచ్చింది.
 
 
హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత ప్రజల శుభాకాంక్షలను నేను ఆయనకు తెలియజేశాను. ఈ విమానాశ్రయం రెండు దేశాల మధ్య స్నేహం మరియు ఆప్యాయతకు నిదర్శనం అవుతుంది, అలాగే భారతదేశం మరియు మాల్దీవులు చేపడుతున్న అనేక ఉమ్మడి ప్రాజెక్టులలో ప్రేరణగా నిలుస్తుంది. ప్రజల మధ్య బలమైన సంబంధాలు మరియు ఉమ్మడి శ్రేయస్సు కోసం, మన దేశాల మధ్య మెరుగైన వాయు అనుసంధానం ఏర్పరచే అన్ని అవకాశాలను మేము చర్చించాము.
ఇటీవల మాల్దీవుల పర్యటనలో భాగంగా,మాల్దీవులలో పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని అక్కడ వివిధ రంగాల్లో చేస్తున్న వారి పని గురించి తేలుసుకున్నాను. భారతీయ ప్రవాసులు మన దేశం అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. వారు భారతదేశానికి మరియు ప్రపంచానికి మధ్య బలమైన వారధిగా కొనసాగుతున్నారు. మీ నిబద్ధత, శ్రమ, మరియు కృషి శ్రీకాకుళం మాత్రమే కాదు, మన దేశానికి కూడా గర్వకారణం. మేము మీ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం మరియు భవిష్యత్తులో కలిసి మరిన్ని గొప్ప విజయాలను సాధించేందుకు ఆశిస్తున్నాం అని కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు తెలిపారు.
The post Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్

ISRO LVM3 : బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM3-M5

Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవితEx MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత

Ex MLC Kavitha : జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు