hyderabadupdates.com Gallery Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌ post thumbnail image

Kiran Majumdar Shaw : బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా (Kiran Majumdar Shaw) ఇటీవల ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత్‌ లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు వైరల్‌ అవుతుంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
Kiran Majumdar Shaw Post Viral
దేశవ్యాప్తంగా చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్య అంటూ ఆమె గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పెద్ద నగరాల్లోని మున్సిపాలిటీలు కూడా దీన్ని పరిష్కరించలేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇందౌర్‌, సూరత్‌, ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల పేర్లను ఆమె ప్రస్తావించారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రజలు, పాలనాధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబయి బాంద్రాలోని ఓ ప్రాంతంలో పడి ఉన్న చెత్తను ఉద్దేశిస్తూ జర్నలిస్టు సుచేతా దలాల్‌ పెట్టిన పోస్టుకు మజుందార్ షా ఇలా స్పందించారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై మజుందార్‌ షా పెట్టిన పోస్టు వైరల్‌ అయ్యింది. బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె వెల్లడించారు. దీనిపై ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థంకావడం లేదంటూ ఆయన పేర్కొన్నారని తెలిపారు. ఈ పోస్టుపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.
Also Read : PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ
The post Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు

జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?

ఇదే వ్యవహారం సినిమాల్లో జరిగితే గనుక.. ‘ఆడికి చిప్ దొబ్బింది రా’ అనే డైలాగు వస్తుంది. ఇది రాజకీయరంగం గనుక, పైగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గనుక అలాంటి డైలాగు అంటే.. నొచ్చుకునే వాళ్లు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, ఒక్క

Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూతAnde Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ