hyderabadupdates.com Gallery KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ post thumbnail image

 
 
స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఆ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీలోని బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు లేని సర్పంచి ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
 
తాము తలుచుకుంటే భూకంపం సృష్టిస్తామన్నారు. బీసీలను తక్కువ అంచనా వేయకండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని.. మీ పీఠాలు కదిలి పోతాయని హెచ్చరించారు. బీసీ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే.. అవసరమైతే సర్పంచ్ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తామన్నారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్‌గా జరుపుతున్నామని వివరించారు.
The post KTR: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

    సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి

జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా మన

Jubilee Hills: నేటి నుండి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో హోం ఓటింగ్Jubilee Hills: నేటి నుండి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో హోం ఓటింగ్

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వయోధికులు, దివ్యాంగులకు హోం ఓటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. అధికారుల బృందం ఇళ్ల వద్దకు వెళ్లి వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. 85 ఏళ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం