hyderabadupdates.com Gallery Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ post thumbnail image

 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైనర్ బాలిక కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 4న తన ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. బాలికను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మిస్టరీగా మారిన ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు… పలు కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేసారు. బాలిక మృతికి సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్‌ మీనా మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ… ‘‘బాలిక హత్యకు సంబంధించి కేసు నమోదు చేశాం. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేశాం. బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్‌ షాపులో అతడు పనిచేసేవాడు. ఆర్థిక సమస్యలతో నిందితుడు తీవ్ర ఒత్తిడిలోఉన్నాడు. అతడి చెల్లి పెళ్లికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నాలుగో తేదీ సాయంత్రం 4.30 గంటలకు బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు బాలిక ఇంటికి శ్రీనివాస్‌ వెళ్లాడు. ఆమె తల్లి లేదని గ్రహించి చోరీ చేయాలనుకున్నాడు. గతంలోనూ బాలిక ఇంటికి ఇతర పనులకు సంబంధించి వెళ్లేవాడు. అక్కడి బెడ్‌రూమ్‌లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఈక్రమంలో ఇంట్లోకి ఎందుకు వచ్చావని బాలిక నిందితుడిని ప్రశ్నించింది. తన తల్లికి విషయం చెప్పాలని ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి… తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. అనంతరం ఆమెను సీలింగ్ ఫ్యాన్ కు వేలాడ దీసి… ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. ‌ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూనే… యూట్యూబర్ గా కూడా పాపులారిటీ సంపాదించిన శ్రీనివాస్… బాలిక మృతి తరువాత… ఆమె కుటుంబ సభ్యులు, పోలీసుల వెనుక తిరుగుతూ విచారణను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించాడు. అయితే బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి… ఆ ఇంటి యజమానిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా… ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ కూడా తరచూ ఆ ఇంటికి వచ్చేవాడని అనుమానం వ్యక్తం చేయడంతో… అతడ్ని అదుపులోనికి తీసుకుని తనదైన శైలిలో ప్రశ్నించగా… నేరాన్ని ఒప్పుకున్నాడు.
శ్రీనివాస్ కు సంబంధించి ఫింగర్ ప్రింట్‌ ఘటనాస్థలిలో దొరికింది. బాలికను అతడే హత్య చేసినట్లు నిర్ధరించాం. సీడీఆర్‌, సీసీటీవీ పరిశీలిస్తే నిందితుడి లోకేషన్‌ అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. మిగతా వారిని విచారించి శ్రీనివాస్‌ను పట్టుకున్నాం. ఆధారాల మేరకు అరెస్టు చేశాం. మరో మెడికల్ రిపోర్టు రావాల్సి ఉంది.. సాంకేతిక ఆధారాల కోసం చూస్తున్నాం.’’ అని ఎస్పీ తెలిపారు.
The post Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలుPonnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar)

CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు

Yathindra Siddaramaiah: ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం – యతీంద్రYathindra Siddaramaiah: ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం – యతీంద్ర

  కర్ణాటకలో సీఎం మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర మరోసారి స్పందించారు. తాను ఏమి చెప్పదలచుకున్నాననే దానిపై ఇప్పటికే వివరణ ఇచ్చానని, మళ్లీ మాట్లాడి వివాదం సృష్టించదలచుకోలేదని