hyderabadupdates.com Gallery Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌ post thumbnail image

 
 
పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేశ్‌ భేటీ అయ్యారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఉన్న కసి, చొరవ అధికారంలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికలకు వ్యూహ రచన చేయలన్నారు. జనసేన, భాజపా ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్‌ఛార్జిల సమన్వయం ఎంతో కీలకమని గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జిలను త్వరలోనే నియమిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించేలా పర్యవేక్షించాలని లోకేశ్‌ తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మధ్య సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కో-ఆర్డినేటర్లదేనని వెల్లడించారు. వారి పనితీరును ప్రతి నెలా సమీక్షిస్తానని తెలిపారు. జోనల్ కోఆర్డినేటర్లే పార్టీకి అన్నీ తామై వ్యవహరించాలన్నారు. వైకాపా పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామని చెప్పారు. పెండింగ్‌లోని పార్టీ పదవులు త్వరితగతిన భర్తీ చేస్తామని ప్రకటించారు. జోనల్ కోఆర్డినేటర్లు.. మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు సమావేశానికి హజరయ్యారు.
The post Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two yearsCM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two years

Chief Minister Revanth Reddy has instructed the officials to complete the construction of the new buildings of Osmania Hospital within two years. He held a review meeting at his residence on the progress of the construction work

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

న్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణన్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణ

అమ‌రావ‌తి : కొత్త సాంకేతిక‌త‌తో రైతుల భూముల‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ