hyderabadupdates.com Gallery PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ post thumbnail image

Narendra Modi : ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర శాంతి ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. గాజా నుంచి 20 మంది ఇజ్రాయెల్ బందీలు తిరిగి విడుదల కావడాన్ని స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోదీ తన స్పందన తెలియజేశారు.
PM Narendra Modi Key Comments
‘రెండేళ్లకు పైగా చెరలో ఉన్న బందీలందరూ విడుదల కావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల ధైర్య సాహసాలకు, అధ్యక్షుడు ట్రంప్ నిరంతర శాంతి యత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి దక్కిన గౌరవం ఇది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాం’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది. తొలుత ఏడుగురు బందీలను, ఆ తర్వత మరో 13 మందిని అప్పగించింది. ఒప్పందంలో భాగంగా 48 మంది ఇజ్రాయెస్ వాసులను హమాస్ విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ బందీల్లో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన హమాస్ త్వరలోనే తక్కిన 28 మంది మృతదేహాలను కూడా అప్పగించనుంది.
Also Read : Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు
The post PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటిMinister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటి

    ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్‌తండలో 2025 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీసీఐ తొలి కేంద్రాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.

Sabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టుSabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టు

    శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR