hyderabadupdates.com Gallery Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్ post thumbnail image

 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు. సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన… అక్కడి డయానా బెంచ్‌ సహా పలు ఏరియాల్లో ఫొటోలు దిగినట్టు తెలిపారు. అంతకముందు.. అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పాటు సుమారు 40 దేశాలకు చెందిన 126 మంది అతిథులతో కూడిన ఓ పెద్ద బృందంతో ఉత్తర్ ప్రదేశ్‌కు చేరుకున్నారు ట్రంప్ జూనియర్. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగే భారతీయ అమెరికన్ జంట హై ప్రొఫైల్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఆయన భారత్‌ కు విచ్ఛేశారు. ఈ రాత్రికి ఆయన ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నట్టు తెలుస్తోంది.
 
ట్రంప్ జూనియర్ హాజరయ్యే ఈ వేడుకకు.. దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులూ వస్తారని సమాచారం. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో ఇప్పటికే అక్కడి అధికార యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆయన భారత పర్యటనకు ముందే.. ఇక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అమెరికా భద్రతా బృందం ఉదయపూర్ చేరుకుంది. ఏసీపీ(ACP), ఏడీసీ(ADC) స్థాయి అధికారులతో సహా సుమారు 200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ట్రంప్ జూనియర్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. గతంలో ఆయన 2018 ఫిబ్రవరిలో తొలిసారిగా ఇండియాలో పర్యటించారు. అప్పుడు.. న్యూఢిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతాలను సందర్శించారు.
The post Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tollywood Megastar Chiranjeevi Secures Legal Protection for Personal RightsTollywood Megastar Chiranjeevi Secures Legal Protection for Personal Rights

Senior Tollywood actor and megastar Chiranjeevi has won a crucial interim order at the Hyderabad City Civil Court, preventing the unauthorized use of his name, photographs, and titles for commercial

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

    బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను

Nobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతిNobel Prize: క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనకు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

Nobel Prize : భౌతికశాస్త్రంలో అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు… ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize) వరించింది. ఆ ముగ్గురూ… బ్రిటన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త జాన్‌ క్లార్క్‌ (83), ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక