hyderabadupdates.com Gallery YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు post thumbnail image

 
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.
 
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు
 
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి వేళ లక్ష్మీదేవికి పూజ చేసిన హిందూ సోదరులు సోమవారం సాయంత్రం నుంచీ టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో టపాసుల మోత మోగిపోతోంది. రెండ్రుజులుగా బాణసంచా దుకాణాలు కిక్కిరిపోతున్నాయి. ఖర్చు ఎంతైనా తగ్గకుండా భారీగా టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దేశంలోని వీధులన్నీ చిన్నాపెద్ద అని తేడా లేకుండా నిండిపోయాయి. అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. కాగా, తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
The post YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్

అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ లో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంత‌కు ముందు స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రిగిన ప్ర‌త్యేక

రూ. 1511 కోట్ల భూమి క‌బ్జా హైడ్రా ఫెన్సింగ్రూ. 1511 కోట్ల భూమి క‌బ్జా హైడ్రా ఫెన్సింగ్

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. పార్కులు, చెరువుల‌ను చెర‌ప‌ట్టిన వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒకే రోజు న‌గ‌రం న‌లువైపులా 4 చోట్ల భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించింది. వెనువెంట‌నే ఫెన్సింగ్ వేసింది. రెండు చోట్ల 1100ల

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలిమెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా